దుర్గగుడి కానుకల చోరీ కేసులో అటెండర్ Arrest
ABN , First Publish Date - 2022-05-15T16:49:56+05:30 IST
దుర్గగుడి కానుకల చోరీ కేసులో అటెండర్ Arrest
ఎన్టీఆర్ జిల్లా/వన్టౌన్ : ఇటీవల దుర్గగుడి (Durga Temple) హుండీలలోని కానుకల లెక్కింపులో వేర్వేరు తేదీల్లో నగదు, బంగారం వస్తువులను అపహరించిన దుర్గగుడి అటెండర్ కగ్గాపుల్లారావు(పుల్లయ్య 51)ను పోలీసులు అరెస్టు చేశారు. వన్టౌన్ స్టేషన్లో శనివారం విలేకరుల సమావేశంలో క్రైం డీసీపీ కొల్లి శ్రీనివాసరావు, పశ్చిమ డివిజన్ ఏసీపీ, డాక్టర్ కె.హనుమంతరావు, క్రైం ఏసీపీ సీహెచ్శ్రీనివాసరావు, సీఐ వెంకటేశ్వర్లుతో కలిసి వెస్ట్డీ సీపీ కె.బాబూరావు వివరాలను వెల్లడించారు.
పుల్లారావు ఈనెల 9వ తేదీన బంగారు వస్తువులు (Gold), రూ.4వేలు, ఏప్రిల్ 11వ తేదీన రూ.10వేలు, 20వతేదీన రూ.6 వేలు నగదు టాయ్లెట్లో (Toilet) దాచిపెట్టి, తరువాత వాటిని తీసుకువెళ్లడానికి ప్లాన్ (Plan) చేశాడని తెలిపారు. ఈవో ఫిర్యాదు మేరకు నాలుగు పోలీసు బృందాలను ఏర్పాటుచేసి, సీసీకెమెరాల (CC Camera) ద్వారా, ఆలయంలోని సిబ్బందిని విచారించడం ద్వారా నిందితుడిని గుర్తించినట్టు తెలిపారు. కేసును చేధించిన సిబ్బందికి రివార్డును ప్రకటించినట్టు తెలిపారు. నిందితుడిపై గతంలో చీరల (Saree) దొంగతనంపైన కూడా ఫిర్యాదు ఉన్నది. నిందితుడు పలుమార్లు చోరీ యత్నం చేయడంతో దుర్గగుడిపై నిఘా వైఫల్యం తేటతెల్లమవుతోంది.