ఐటీడీఏ పీవో వైఖరి మార్చుకోవాలి

ABN , First Publish Date - 2021-05-09T05:43:23+05:30 IST

ఉద్యోగులను ఇబ్బందులు పెడుతున్న రంపచోడవరం ఐటీడీఏ పీవో వైఖరి మార్చుకోవాలని, లేకుంటే ఉద్యమిస్తామని ఎస్సీ, ఎసీ,్ట బీసీ, మైనార్టీ ఉద్యోగుల ప్రొఫెషనల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి బాబ్జి హెచ్చరించారు.

ఐటీడీఏ పీవో వైఖరి మార్చుకోవాలి

  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉద్యోగుల ప్రొఫెషనల్‌ అసోసియేషన్‌

రాజమహేంద్రవరం సిటీ, మే 8: ఉద్యోగులను ఇబ్బందులు పెడుతున్న రంపచోడవరం ఐటీడీఏ పీవో వైఖరి మార్చుకోవాలని, లేకుంటే ఉద్యమిస్తామని ఎస్సీ, ఎసీ,్ట బీసీ, మైనార్టీ ఉద్యోగుల ప్రొఫెషనల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి బాబ్జి హెచ్చరించారు. రాజమహేంద్రవరంలోని అసోసియేషన్‌ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా సమయంలో సమర్థవంతంగా సేవలందిస్తున్న ఉద్యోగుల పట్ల పీవో అవమానకరంగా మాట్లాడారని, దీనిపై ఈనెల 4న జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్ళారని, అయినా పీవో వైఖరీలో మార్పు రాలేదని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్‌ దీనిపై దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సమావేశంలో అసోసియేషన్‌ నాయకులు పి.రవికుమార్‌, సీహెచ్‌ సుబ్బారావు, చింతా అనిల్‌బాబు, ఎస్‌.గన్నియ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-09T05:43:23+05:30 IST