హైదరాబాద్ : కోడలిపై అత్త ఫిర్యాదు.. ఎందుకంటే..
ABN , First Publish Date - 2021-06-21T18:11:58+05:30 IST
అనంతరం కాచిగూడ చప్పల్బజార్లో అఖిలేష్ కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. ..
హైదరాబాద్/బర్కత్పుర: ఇంట్లో ఉన్న రూ. 8 లక్షల 60వేలు విలువ చేసే బంగారం, వెండి నగలను కోడలు తీసుకెళ్లిందని అత్త కాచిగూడ పోలీస్స్టేషన్లో ఫిర్యా దు చేసింది. ఏపీలోని భీమవరానికి చెందిన లక్ష్మీభవానీకి కాచిగూడకు చెందిన అఖిలేష్(25)తో 2020 డిసెంబర్లో వివాహం జరిగింది. వివాహం అనంతరం కాచిగూడ చప్పల్బజార్లో అఖిలేష్ కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. ఇటీవల లక్ష్మీభవానీ తమ్ముడు అజయ్ భీమవరం నుంచి చప్పల్బజార్లోని అక్క ఇంటికి వచ్చాడు. అజయ్ కొన్నిరోజులు ఉన్నాడు. కోడలు లక్ష్మీభవానీ తన తమ్ముడితో కలిసి ఇంట్లో ఉన్న 8లక్షల 60వేల విలువైన బంగారు వెండి నగలను తీసుకొని వెళ్లిందని అత్త ఇందిర కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కోడలు లక్ష్మీభవానీ వెళ్లిన తర్వాత ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు కనిపించలేదని ఫిర్యాదులో పేర్కొంది. కేసు దర్యాప్తు చేస్తున్నామని కాచిగూడ పోలీసులు తెలిపారు.