బాలుడిని చంపిన మేనత్త
ABN , First Publish Date - 2021-03-02T23:50:32+05:30 IST
నగరంలోని పాతబస్తీలో ఘోరం జరిగింది. పాతబస్తీలోని
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో ఘోరం జరిగింది. పాతబస్తీలోని భవానీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది. 3 ఏళ్ల బాలుడిని మేనత్త ఆయేషా దారుణంగా చంపింది. బాలుడిని భవనం పైనుంచి మేనత్త కిందకు పడేసింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తనకు వివాహం జరిగి రెండేళ్లు అవుతున్నా సంతానం కలగకపోవడంతో ఈ దారుణానికి ఆయేషా ఒడగట్టింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.