అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-11-28T04:08:19+05:30 IST
మండలంలోని రంగనపాలెం గ్రామంలో అను మానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెంది న సంఘటన శనివారం వెలుగు చూసిం ది.
పుల్లలచెరువు, నవంబరు 27: మండలంలోని రంగనపాలెం గ్రామంలో అను మానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెంది న సంఘటన శనివారం వెలుగు చూసిం ది. బంధువుల కథనం ప్రకారం రంగనపాలెంవాసి బోక్యా అంజినాయక్ శుక్రవారం మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదు. సాయంత్రం ఇంటికి రాకపోవడంతో గ్రామంలో బంధువులు ఆరా తీశారు. శనివారం ఉదయం గ్రామానికి సమీపంలోని రంగనపాలెం పోలేరమ్మ గుడికి ఎదురుగా ఉన్న పత్తి చేనులో అంజినాయక్ (33) మృ తదేహాన్ని రైతు చూసి గ్రామస్థులకు తెలిపాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ వేముల సుధాకర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సమీపంలో పురుగుల మందు డబ్బా, కూల్డ్రింక్ బాటిల్, మద్యం సీసా ను గుర్తించారు. అంజినాయక్ది ఆత్మహత్య కాదు.. హత్య అని కుటుంబ సభ్యులు పట్టుబట్టడంతో పోలీసులు డాగ్ స్క్వాడ్ను రప్పించగా కొద్ది దూ రం తిరిగింది. క్లూస్ టీం వేలిముద్రలు సేకరించారు. బంధువులు, భార్య మాత్రం ఇది అంజినాయక్ది హత్యేగా ఆరోపిస్తున్నారు. ఎర్రగొండపాలెం సీఐ దేవ ప్రభాకర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అంజినాయక్కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోలీసులు వైపాలెం వైద్యశాలకు తరలించారు. భార్య భూలక్ష్మి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుధాకర్ తెలిపారు.