‘నాట్రోల్’ను అమ్మిన అరబిందో
ABN , First Publish Date - 2020-10-27T05:57:18+05:30 IST
అమెరికా అనుబంధ కంపెనీ ‘నాట్రోల్’ను అరబిందో ఫార్మా విక్రయించింది. దాదాపు రూ.4,048 కోట్లకు (
డీల్ విలువ రూ.4,048 కోట్లు
న్యూఢిల్లీ: అమెరికా అనుబంధ కంపెనీ ‘నాట్రోల్’ను అరబిందో ఫార్మా విక్రయించింది. దాదాపు రూ.4,048 కోట్లకు (55 కోట్ల డాలర్లు) ఈ కంపెనీని కొనేందుకు న్యూ మౌంటెన్ క్యాపిటల్ అనే ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) సంస్థతో ఒప్పందంపై సంతకాలు పూర్తయినట్టు అరబిందో ఫార్మా సోమవారం ప్రకటించింది. పూర్తిగా నగదు చెల్లింపు పద్దతిలో జరిగిన ఈ ఒప్పందం వచ్చే ఏడాది జనవరికల్లా పూర్తవుతుందని తెలిపింది.
పోషకాహార ఉత్పత్తుల రంగంలో ఉన్న నాట్రోల్ కంపెనీని అరబిందో ఫార్మా డిసెంబరు, 2014లో కొనుగోలు చేసింది. అప్పటి నుంచి నాట్రోల్ కంపెనీ లాభాల్లోనే ఉంది. మార్చి, ఈనిధులను అప్పుల చెల్లింపు, ఇతర వ్యూహాత్మక వ్యాపార అవసరాలకు వినియోగిస్తామని అరబిందో ఫార్మా ఎండీ ఎన్ గోవిందరాజన్ చెప్పారు.