బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
ABN , First Publish Date - 2020-11-24T10:29:20+05:30 IST
మండల కేంద్రంలోని ఓ విధిలో గుట్టుగా జరుగుతున్న బాల్యవివాహాన్ని అధికారులు ఆదివారం రాత్రి అడ్డుకున్నారు. మైనారిటీ తీరని బాలికకు వివాహం చేస్తున్నారని ఐసీడీఎస్ ఏటూరునాగారం ప్రాజెక్ట్ అధికారి (సీడీపీవో)
ఏటూరునాగారం, నవంబరు 23: మండల కేంద్రంలోని ఓ విధిలో గుట్టుగా జరుగుతున్న బాల్యవివాహాన్ని అధికారులు ఆదివారం రాత్రి అడ్డుకున్నారు. మైనారిటీ తీరని బాలికకు వివాహం చేస్తున్నారని ఐసీడీఎస్ ఏటూరునాగారం ప్రాజెక్ట్ అధికారి (సీడీపీవో) వి.హేమలతకు సమాచారం అందగా ఆమె అక్కడికి చేరుకొని వివాహా న్ని అడ్డుకున్నారు. అనంతరం ఎస్సై శ్రీకాంత్ రెడ్డి, ఐసీపీఎస్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎన్. హరికృష్ణ, 1098 టీమ్ మెంబర్ రమ్య సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు.