కనిష్ఠంగా రూ.40
ABN , First Publish Date - 2022-06-09T16:14:13+05:30 IST
త్వరలో ఆటో చార్జీలు పెరగడం ఖాయమైపోయింది. ఆటోకు కనిష్ఠంగా రూ.40, ఆ తరువాత కి.మీటరుకు రూ.18 చొప్పున వసూలు చేయొచ్చంటూ రాష్ట్ర
- కిలోమీటర్కు రూ.18
- ఆటో చార్జీలపై ప్రభుత్వ కమిటీ సిఫారసు
చెన్నై, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): త్వరలో ఆటో చార్జీలు పెరగడం ఖాయమైపోయింది. ఆటోకు కనిష్ఠంగా రూ.40, ఆ తరువాత కి.మీటరుకు రూ.18 చొప్పున వసూలు చేయొచ్చంటూ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫారసు చేసింది. ఆటో చార్జీల ఖరారు కోసం హైకోర్టు ఆదేశాల మేరకు ఏప్రిల్లో రాష్ట్ర రవాణాశాఖ ఓ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఆటోడ్రైవర్లు, యజమానులు, వినియోగదారులతో పాటు వివిధ వర్గాలవారితో భేటీ అయిన ఆ కమిటీ ఇటీవల ప్రభుత్వానికి పలు సూచనలు చేస్తూ నివేదిక సమర్పించింది. 2013 ఆగస్టులో చివరిగా రాష్ట్ర ప్రభుత్వం ఆటో చార్జీలను పునరుద్ధరించింది. కనిష్ఠంగా రూ.25, ప్రతి కి.మీటరుకు రూ.12, వెయిటింగ్ చార్జీ రూ.3.50గా అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఆ తరువాత మళ్లీ ఇప్పుడు ఆటో చార్జీల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. కమిటీ సిఫార్సులను పరిశీలించి త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది.