ఆటో ఢీకొని వృద్ధురాలి దుర్మరణం
ABN , First Publish Date - 2021-06-15T05:18:37+05:30 IST
జీజేవలస సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇనుపకుర్తి శాంతమ్మ (60) అనే వృద్ధురాలు దుర్మరణం పాలయ్యారు. లావేటిపా లెంకు చెందిన ఆమె సోమవారం కూరగాలు కొనుగోలు చేసేందుకు లావేరు వెళ్లారు.
లావేరు: జీజేవలస సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇనుపకుర్తి శాంతమ్మ (60) అనే వృద్ధురాలు దుర్మరణం పాలయ్యారు. లావేటిపా లెంకు చెందిన ఆమె సోమవారం కూరగాలు కొనుగోలు చేసేందుకు లావేరు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో భాగంగా నడిచి వస్తుండగా వెనుక నుంచి వచ్చిన ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో శాంతమ్మ అపస్మారకస్థితికి చేరుకుంది. స్థానికులు 108 వాహనంలో శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ ఆమె మృతిచెందింది. ఎస్ఐ విజయ్కుమార్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.