ఆటో డ్రైవర్కు వివాహితతో అనుకోకుండా పరిచయం.. నిర్మానుష్య ప్రదేశంలో ఇద్దరూ ఏకాంతంగా ఉండగా.. షాకింగ్ సీన్..
ABN , First Publish Date - 2022-01-26T00:02:50+05:30 IST
కర్ణాటకకు చెందిన ఆటో డ్రైవర్కు ఓ వివాహితతో పరిచయం ఏర్పడింది. ఓ రోజు నిర్మానుష్య ప్రదేశంలో ఇద్దరూ ఏకాంతంగా ఉండగా.. షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
కొన్నిసార్లు అనుకోకుండా ఏర్పడే పరిచయాలు.. అనూహ్య పరిణామాలకు దారి తీస్తుంటాయి. హద్దుల్లో ఉండే పరిచయాలైతే పర్వాలేదు గానీ... పరిధి దాటిపోయే పరిచయాల విషయంలో మాత్రం చివరకు సమస్యలు తప్పవు. ఇక పెళ్లయిన మగ, ఆడవారి మధ్య ఏర్పడే పరిచయాలు.. చివరకు ఎంతవరకు దారి తీస్తుంటాయో రోజూ చూస్తూనే ఉన్నాం. కర్ణాటకకు చెందిన ఆటో డ్రైవర్కు ఓ వివాహితతో పరిచయం ఏర్పడింది. ఓ రోజు నిర్మానుష్య ప్రదేశంలో ఇద్దరూ ఏకాంతంగా ఉండగా.. షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
కర్ణాటక హుబ్లీ జిల్లాలోని కలఘటికి తాలూకా కురివినకొప్ప గ్రామానికి చెందిన వివాహిత సమీపంలోని ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తోంది. రోజూ పక్క గ్రామానికి చెందిన మంజునాథ్ ఆటోలో ఫ్యాక్టరీకి వెళ్లేది. వస్తూ, పోయే క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా.. వివాహేతర సంబంధానికి దారి తీసింది. పనికి వెళ్తున్నానని చెబుతూ మంజునాథ్తో గడుపుతూ ఉండేది. ఈ విషయం ఆనోటా, ఈనోటా పడి.. చివరికి వివాహిత అన్న బసవరాజకు తెలిసింది. పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు మంజునాథ్కు సూచించాడు. అయినా వారిద్దరూ తరచూ కలుస్తూ ఉండేవారు.
ప్రియుడితో కలిసి పారిపోయేందుకు భార్య ప్లాన్.. తీరా వెళ్లే క్రమంలో ఎంటరైన భర్త.. చివరకు ఇలా చేస్తాడని ఎవరూ ఊహించలేదు..
ఈ క్రమంలో ఈ నెల 18న ఆమె తన ప్రియుడికి ఫోన్ చేసి నిర్మానుష్య ప్రదేశానికి పిలిచింది. అక్కడికి వెళ్లిన మంజునాథ్.. ఆమెతో ఏకాంతంగా మాట్లాడుతూ ఉండగా, సడన్గా షాకింగ్ సీన్ కనిపించింది. మహిళ అన్న బసవరాజు, కొందరు మనుషులు అక్కడికి వెళ్లారు. మంజునాథ్పై ఒక్కసారిగా తీవ్రంగా దాడి చేశారు. దీంతో అతడు.. అక్కడికక్కడే మృతి చెందాడు. చెల్లెలితో బసవరాజే ఫోన్ చేయించి పిలిపించాడని పోలీసు విచారణలో తేలింది. కేసు దర్యాప్తులో ఉంది.