వివాహితపై ఆటో డ్రైవర్ అమానుషం
ABN , First Publish Date - 2021-03-01T09:40:18+05:30 IST
ఆటో ఎక్కిన వివాహితపై మరో ప్రయాణికుడితో కలిసి డ్రైవర్ అత్యాచారం చేశాడు. కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
ప్రయాణికుడితో కలిసి అత్యాచారం..
కొత్తగూడెం జిల్లాలో ఘటన
కరకగూడెం, ఫిబ్రవరి 28: ఆటో ఎక్కిన వివాహితపై మరో ప్రయాణికుడితో కలిసి డ్రైవర్ అత్యాచారం చేశాడు. కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పినపాక మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత కరకుగూడెం మండలంలోని తన పుట్టింటికి వెళ్లేందుకు శనివారం సాయంత్రం ఎడూళ్లబయ్యారం క్రాస్రోడ్డు వద్ద ఆటో ఎక్కింది. ఆ సమయంలో ఆటోలో డ్రైవర్తో పాటు మరో వ్యక్తి ఉన్నాడు. ఈ క్రమంలో రాళ్లవాగు పెద్దమ్మతల్లి ఆలయం వద్దకు రాగానే ఆటోను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. ఓ చోట వాహనాన్ని ఆపి వివాహితను చిత్రహంసలు పెడుతూ అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై ఆదివారం పోలీసులకు ఫిర్యాదు అందింది. నిందితులు ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.