ఆటోడ్రైవర్ దారుణహత్య
ABN , First Publish Date - 2021-05-11T17:05:31+05:30 IST
నగరంలోని మిల్లర్పేట కాలనీకి చెందిన ఆటోడ్రైవర్ రాంబాబు (26) దారుణహత్యకు గురైనాడు. అతను ఆదివారం రాత్రి ఆంద్రాళ్ బైపాస్ దగర తోటి ఆటోడ్రైవర్లతో కలిసి మద్యం
బళ్లారి(కర్ణాటక): నగరంలోని మిల్లర్పేట కాలనీకి చెందిన ఆటోడ్రైవర్ రాంబాబు (26) దారుణహత్యకు గురైనాడు. అతను ఆదివారం రాత్రి ఆంద్రాళ్ బైపాస్ దగర తోటి ఆటోడ్రైవర్లతో కలిసి మద్యం సేవించాడు. ఆ సమయంలో పాత కక్షలతో పవన్, విజయ్, కృష్ణ అనే ఆటోడ్రైవర్లు మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. కృష్ణ అనే వ్యక్తి రాంబాబు తలపై రాయితో బలంగా కొట్టడంతో అతను అక్కడిక్కడికే మృతిచెందాడు. బ్రూస్పేట పోలీసులు మృత దేహాన్ని విమ్స్కు తరలించారు. పోలీసులు నిందితులైన పవన్, విజయ్, కృష్ణ కోసం గాలిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.