‘అత్యవసర పరిస్థితుల్లోనే ఆటోలు తిరగాలి’

ABN , First Publish Date - 2021-05-11T05:34:29+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో కర్ఫ్యూ నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆటోలు తిరగాలని కర్నూలు ట్రాఫిక్‌ డీఎస్పీ మహబూబ్‌ బాషా అన్నారు.

‘అత్యవసర పరిస్థితుల్లోనే ఆటోలు తిరగాలి’

కర్నూలు, మే 10:  రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో కర్ఫ్యూ నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆటోలు తిరగాలని కర్నూలు ట్రాఫిక్‌ డీఎస్పీ మహబూబ్‌ బాషా అన్నారు.   సోమవారం కర్నూలు డీఎస్పీ మహేష్‌ ఆధ్వర్యంలో ఆటో యూనియన్‌ల నాయకులతో కర్ఫ్యూ ఆంక్షలపై ఆయన మాట్లాడారు.    నగరంలోని వివిధ ఆటో యూనియన్లు, ఆటోస్టాండ్లకు సంబంధించి సుమారు 30 ఆటోలకు పోలీస్‌శాఖ ఈపాస్‌లు జారీ చేసిందన్నారు. ప్రతి ఒక్కరూ అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఆటోలో ప్రయాణించాలని, అనవసరంగా బయట తిరగరాదన్నారు. మాస్కులు ధరిస్తూ, శానిటైజర్లు వాడాలని సూచించారు. నిర్ణీత పాత లింక్‌ ప్రకారమే ఆటో చార్జీలు వసూలు చేయాలని, అధికంగా వసూలు చేసే ఆటోల పాస్‌లు రద్దు చేస్తామన్నారు.   పర్మిషన్‌ ఇచ్చిన ఆటో డ్రైవర్లు  ఖాకీ యూనిఫామ్‌ ధరించాలన్నారు. ఐడీ కార్డు తప్పనిసరిగా మెడలో ధరించాలని సూచించారు. 

Updated Date - 2021-05-11T05:34:29+05:30 IST