ఆటో బోల్తా

ABN , First Publish Date - 2021-09-08T02:10:25+05:30 IST

జిల్లాలోని తణుకు దగ్గర జాతీయ రహదారిపై అదుపుతప్పి ఆటో

ఆటో బోల్తా

పశ్చిమ గోదావరి జిల్లా: జిల్లాలోని తణుకు దగ్గర జాతీయ రహదారిపై అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. జాతీయ రహదారిపై ఉన్న దువ్వ దగ్గర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 8 మందికి గాయాలయ్యాయి. దువ్వ దానేశ్వరి అమ్మవారి దేవాలయానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆటో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఆటోలో 10 మంది ప్రయాణికులు ఉన్నారు.

Updated Date - 2021-09-08T02:10:25+05:30 IST