ఆటో బోల్తా: భార్య మృతి, భర్తకు గాయాలు

ABN , First Publish Date - 2021-05-11T04:45:22+05:30 IST

కొవిడ్‌ పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లి తిరిగి వస్తుండగా ఆటో బోల్తా పడిన ప్రమాదంలో భార్య మృతి చెందగా భర్త గాయాలపాలయ్యాడు.

ఆటో బోల్తా: భార్య మృతి, భర్తకు గాయాలు

ప్రత్తిపాడు, మే 10: కొవిడ్‌ పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లి తిరిగి వస్తుండగా ఆటో బోల్తా పడిన ప్రమాదంలో భార్య మృతి చెందగా భర్త గాయాలపాలయ్యాడు. ప్రత్తిపాడు మండలం రాచపల్లిలో సోమవారం ఈ సంఘటన జరిగింది. ఎస్‌ఐ సుధాకర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రత్తిపాడు ఎస్సీ కాలనీకి చెందిన కాకర రామలక్ష్మి, కాకర రాజబాబు దంపతులు. కొవిడ్‌ పరీక్షల కోసం తమ సొంత ఆటోలో రాచపల్లి పీహెచ్‌సీకి వెళ్లారు. పీహెచ్‌సీలో కొవిడ్‌ పరీక్షలకు శాంపిల్స్‌ ఇచ్చి తిరిగి ఆటోలో బయల్దేరారు. ఆటోను భర్త రాజబాబు నడుపుతుండగా రాచ పల్లి రైస్‌మిల్లు వద్దకు రాగానే ఆటో బండరాయి ఎక్కి బోల్తా పడింది. ఈ సంఘటనలో భార్య కాకర రామలక్ష్మి(23)కు తలకు బలమైన గాయం అవడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. భర్త రాజబాబుకు తీవ్రగాయాలయ్యాయి.
 అతడిని ఆస్పత్రికి తరలించారు. రామలక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-05-11T04:45:22+05:30 IST