విషాదం: ఆటో-ట్యాంకర్ ఢీ.. ముగ్గురి మృతి

ABN , First Publish Date - 2020-09-26T00:02:23+05:30 IST

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. తాళ్ళరేవు బైపాస్ రోడ్డులో ఆటో- ట్యాంకర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు

విషాదం: ఆటో-ట్యాంకర్ ఢీ.. ముగ్గురి మృతి

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. తాళ్ళరేవు బైపాస్ రోడ్డులో ఆటో- ట్యాంకర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు అంధులు ఉన్నారు. కాకినాడ శారదాదేవి టెంపుల్, భానుగుడికి చెందిన వారుగా గుర్తించారు. మూడో వ్యక్తి ఆటోడ్రైవర్ ఆరెళ్ళ వెంకటేష్( 17)గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-09-26T00:02:23+05:30 IST