Bus services: ఆవడి నుంచి పలుప్రాంతాలకు బస్సులు

ABN , First Publish Date - 2022-08-06T15:01:00+05:30 IST

స్థానిక ఆవడి నుంచి తిరునల్వేలి, తూత్తుకుడి(Thirunalveli, Thoothukudi)కి కొత్త బస్సు సేవలను శుక్రవారం రాష్ట్ర పాడిపరిశ్రమల శాఖ మంత్రి

Bus services: ఆవడి నుంచి పలుప్రాంతాలకు బస్సులు

ప్యారీస్‌(చెన్నై), ఆగస్టు 5: స్థానిక ఆవడి నుంచి తిరునల్వేలి, తూత్తుకుడి(Thirunalveli, Thoothukudi)కి కొత్త బస్సు సేవలను శుక్రవారం రాష్ట్ర పాడిపరిశ్రమల శాఖ మంత్రి ఎస్‌ఎం నాజర్‌(Minister SM Nasser) జెండా ఊపి ప్రారంభించారు. ఎస్‌ఈటీసీ జనరల్‌ మేనేజర్‌ గుణశేఖర్‌, ఆవడి మేయర్‌ ఉదయ్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి నాజర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆవడి బస్టాండ్‌ నుంచి ప్రతిరోజు సాయంత్రం 4.30 గంటలకు తిరునల్వేలికి బస్సు బయల్దేరుతుంది. అదే విధంగా, అక్కడి నుంచి ఆవడికి తిరునల్వేలి బస్టాండ్‌(Tirunalveli Bus Stand) నుంచి సాయంత్రం 4.30 గంటలకు బయల్దేరే ఈ బస్సులో ప్రయాణించేందుకు టిక్కెట్టు ధర రూ.640గా నిర్ణయించారు. ఆవడి నుంచి ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు తూత్తుకుడికి బయల్దేరుతుంది. మరుమార్గంలో తూత్తుకుడి నుంచి సాయంత్రం 5 గంటలకు బయల్దేరే ఈ బస్సులో ప్రయాణం చేసేందుకు టిక్కెట్టు ధర రూ.620గా నిర్ణయించారు.

Updated Date - 2022-08-06T15:01:00+05:30 IST