ప్రజావసరాలు తీర్చేందుకే జలజీవన్‌ మిషన్‌

ABN , First Publish Date - 2021-03-07T02:42:25+05:30 IST

ప్రజల నీటి అవసరాలను తీర్చేందుకే ప్రభుత్వం జలజీవన్‌ మిషన్‌ ప్రారంభిస్తున్నదని ఎం

ప్రజావసరాలు తీర్చేందుకే జలజీవన్‌ మిషన్‌
అవగాహన కల్పిస్తున్న ఎంపీడీవో ప్రత్యూష

ముత్తుకూరు, ిమార్చి6: ప్రజల నీటి అవసరాలను తీర్చేందుకే ప్రభుత్వం జలజీవన్‌ మిషన్‌ ప్రారంభిస్తున్నదని ఎంపీడీవో ప్రత్యూష పేర్కొన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో శనివారం నిర్వహించిన జలజీవన్‌ అవగా హన సదస్సులో ఆమె మాట్లాడారు. తాగునీటితో పాటు, ఇతర అవసరాలకు సరిపడా నీటిని ప్రజలకు సరఫరా చేయడమే ఈ మిషన్‌ ఉద్ధేశమన్నారు. గ్రామాల్లో ప్రస్తుతం తాగునీటి వనరులు ఎలా ఉన్నాయి, వాటర్‌ ట్యాంకుల పరిస్థితి, తాగునీటి సరఫరా వంటి అంశాలను అధ్యయనం చేసి నివేదిక అందించాలన్నారు. . కార్యక్రమంలో ఈవోఆర్‌డీ హేమంత్‌, ఏవో లక్ష్మణ్‌కుమార్‌, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-07T02:42:25+05:30 IST