ఆసుపత్రిలో ఉన్న తల్లికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అంకితమిచ్చిన అవేశ్ ఖాన్
ABN , First Publish Date - 2022-04-05T21:51:59+05:30 IST
సన్రైజర్స్ హైదరాబాద్తో సోమవారం రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ 12 పరుగుల తేడాతో విజయం
ముంబై: సన్రైజర్స్ హైదరాబాద్తో సోమవారం రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. 170 పరుగుల ఓ మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ను అవేశ్ ఖాన్, జాసన్ హోల్డర్ బెంబేలెత్తించారు. చివరి ఓవర్లో హోల్డర్ మూడు వికెట్లు పడగొట్టి జట్టుకు విజయాన్ని అందించగా, అవేశ్ ఖాన్ నాలుగు కీలక వికెట్లు తీసి జట్టు విజయానికి పునాదులు వేశాడు.
అద్భుత ప్రదర్శన కనబరిచిన అవేశ్ఖాన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. తనకొచ్చిన ఈ అవార్డును అవేశ్ ఖాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లికి అంకితమిచ్చాడు. అవార్డు అందుకున్న అనంతరం అవేశ్ ఖాన్ మాట్లాడుతూ.. తన తల్లి తనకు ఎంతో ప్రత్యేకమని, ఆమెకు ఈ బహుమతిని అంకితమిస్తున్నట్టు పేర్కొన్నాడు. తల్లి నుంచి తనకు ఎంతో మద్దతు లభించిందన్నాడు. మ్యాచ్ అనంతరం వెంటనే ఆసుపత్రిలో ఉన్న తల్లితో మాట్లాడానని చెప్పుకొచ్చాడు. మ్యాచ్కు సంబంధించి అన్ని విషయాలు చెప్పానని, దేవుడి దయవల్ల ఆమె ఇప్పుడు బాగానే ఉన్నారని చెప్పాడు.