సాగు పద్ధతులపై అవగాహన పెంచాలి
ABN , First Publish Date - 2021-02-28T07:07:25+05:30 IST
పంటల సాగులో అధునాతన పద్ధతులు అవలంబించడంతో పాటు సస్యరక్షణలో యాజమాన్య పద్దతులపై రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని జేడీఏ శ్రీరామమూర్తి సూచించారు.
జేడీఏ శ్రీరాంమూర్తి
దర్శి, ఫిబ్రవరి 27 : పంటల సాగులో అధునాతన పద్ధతులు అవలంబించడంతో పాటు సస్యరక్షణలో యాజమాన్య పద్దతులపై రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని జేడీఏ శ్రీరామమూర్తి సూచించారు. స్థానిక వ్యవసాయ పరిశోధన స్థానంలో శనివారం నిర్వహించిన శిక్షణా, వర్క్షా్పలో ఆయన మాట్లాడారు. వేసవికాలంలో సాగుచేసే నువ్వులు, మినుములు,పెసర, మొక్కజొన్న, మిర్చి, వరి పంటల సాగులో యాజమాన్య పద్ధతులపై రైతులకు శిక్షణా తరగతులు నిర్వహించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన అధికారి డాక్టర్ ఎస్.భారతి, కృషి విజ్ఞాన కేంద్రం పోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ దుర్గాప్రసాద్, ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ వరప్రసాదరావు, హర్టికల్చర్ పరిశోధనస్థానం ప్రధానాధికారి ముత్యాలనాయుడు, వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ జి.రమేష్, జాహ్నవి, సత్యస్వరూప, సునీత, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.