పీసా చట్టంపై అవగాహన అవసరం

ABN , First Publish Date - 2021-03-02T05:28:14+05:30 IST

పీసా చట్టంపై ప్రతి గిరి జనుడు అవగాహన కలిగి ఉండాలిన ఐటీడీఏ పీవో ఆర్‌. కూర్మనాఽథ్‌ అన్నారు.

పీసా చట్టంపై అవగాహన అవసరం

కురుపాం రూరల్‌: పీసా చట్టంపై ప్రతి గిరి జనుడు అవగాహన కలిగి ఉండాలిన ఐటీడీఏ పీవో ఆర్‌. కూర్మనాఽథ్‌ అన్నారు. ఈ మేరకు సోమవారం గొటివాడ గ్రామంలో ఆర్ట్‌ స్వచ్ఛంద సంస్థ, ఐసీ డీఎస్‌ సంయుక్తంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజ రయ్యారు. పీసా చట్టంపై గ్రామ సభలు నిర్వహించి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్య త ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలపై ఉందని పీవో తెలిపారు. గిరిజన ప్రాంతంలోని ప్రతి గిరిజనుడు భూ బదలాయింపు చట్టంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. స్వచ్ఛంద సేవకుడు ఎస్‌.కె. గౌష్‌, గొటివాడ సచివాలయం సిబ్బందితో పాటు అధిక సంఖ్యలో గిరిజనులు కార్యక్రమంలో పాల్గొన్నారు.


Updated Date - 2021-03-02T05:28:14+05:30 IST