స్వచ్ఛతపై అవగాహన

ABN , First Publish Date - 2022-06-29T05:07:37+05:30 IST

ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉం చుకోవాలని డివిజనల్‌ పంచాయతీ అధికారి శివకుమారి, డీపీఆర్‌సీ జేఎ్‌సఎస్‌ కోఆర్డినేటర్‌ ఆమోద్‌ సూచించారు.

స్వచ్ఛతపై అవగాహన
సమావేశంలో మాట్లాడుతున్న డీఎల్‌పీఓ శివకుమారి

జమ్మలమడుగు రూరల్‌, జూన్‌ 28: ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉం చుకోవాలని డివిజనల్‌ పంచాయతీ అధికారి శివకుమారి, డీపీఆర్‌సీ జేఎ్‌సఎస్‌ కోఆర్డినేటర్‌ ఆమోద్‌ సూచించారు. మంగళవారం గొరిగెనూరులో చెత్తనుంచి సంపద తయారీ కేంద్రం వద్ద స్వచ్ఛతపై సర్పం చ్‌ మత్తయ్య ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. సమావేశంలో డీఎల్‌పీఓ శివకుమారి ఎంపీడీఓ అరుంధతి మాట్లాడుతూ శుభ్రతతోనే వ్యాధులు దూరం అవుతాయన్నారు. తడి, పొడిచెత్తను చెత్తసేకరణ వారికి అందించాలన్నారు. ఎంపీటీసీ విజయభాస్కర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, వలంటీర్లు, మహిళలు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-29T05:07:37+05:30 IST