అడవుల ఆవశ్యకతపై అవగాహన కల్పించాలి

ABN , First Publish Date - 2022-08-13T06:03:41+05:30 IST

నేటితరం పిల్లలకు అడవుల ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ అన్నారు.

అడవుల ఆవశ్యకతపై అవగాహన కల్పించాలి
వృక్షాలకు రాఖీ కడుతున్న ఎమ్మెల్యే, చైర్మన్‌, కలెక్టరు, ఎస్పీ

ఎమ్మెల్యే డాక్టరు సంజయ్‌కుమార్‌

అటవీ ప్రాంతంలో వృక్ష బంధన్‌ వేడుకలు

సారంగాపూర్‌, ఆగస్టు, 12 : నేటితరం పిల్లలకు అడవుల ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ అన్నారు. అ టవీశాఖ ఆధ్వర్యంలో సారంగాపూర్‌ అటవీ ప్రాంతంలో బతుకమ్మ కుంట సమీప ప్రాంతంలో శుక్రవారం స్వతంత్ర వజ్రోత్సవాల కార్యక్రమంలో భా గంగా వృక్ష బంధన్‌ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమా నకి ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, జడ్పీ చైర్మన్‌ దావ వసంత సురేష్‌, కలెక్ట రు రవి, ఎస్పీ సింధూ శర్మ హజరై చెట్లకు రాఖీలు కట్టారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి కుటుంబం అడవులకు వెళ్లి వాటి ఆ వశ్యకతపై పిల్లలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో అట వీ విస్తీర్ణం పెరగడానికి జిల్లా అటవీక శాక అధికారి విషేక కృషిచేస్తు న్నారని కొనియాడారు. ఈకార్యక్రమంలో డీఎఫ్‌వో వెంకటేశ్వర్‌రావు, ఎంపీ పీ కోల జమున, జడ్పీటీసీ మనోహర్‌రెడ్డి, సర్పంచ్‌ల పోరం అధ్యక్షులు రా జేందర్‌రెడ్డి, ఈడీ లక్ష్మినారాయణ, విద్యార్థులు, అటవీశాఖ అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

 

Updated Date - 2022-08-13T06:03:41+05:30 IST