ప్రమాదంలో దూరమై.. ప్రతిమగా చేరువై..

ABN , First Publish Date - 2022-08-12T08:57:04+05:30 IST

ప్రమాదంలో దూరమై.. ప్రతిమగా చేరువై..

ప్రమాదంలో దూరమై.. ప్రతిమగా చేరువై..

మరణించిన అక్కకు విగ్రహం పెట్టించిన తమ్ముడు

శంఖవరం, ఆగస్టు 11: రోడ్డు ప్రమాదంలో దూరమైన అక్కను.. నిత్యం కళ్లముందే చూసుకోవాలని ఆ తమ్ముడు పరితపించాడు. తోబుట్టువు విగ్రహాన్ని తయారు చేయించి.. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆవిష్కరించాడు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన గాబు రాజా సోదరి మణి గతంలో బైక్‌ ప్రమాదంలో మృతి చెందింది. బైక్‌పై ప్రయాణిస్తుండగా వెనుక చక్రంలో చున్నీ ఇరుక్కుని ఆమె ప్రమాదం బారిన పడింది. ఆమె మృతిని జీర్ణించుకోలేని రాజా తన సోదరిలా ఎవరికీ జరగకూడదని సోషల్‌ మీడియాలో ప్రచారం నిర్వహించాడు. అలాగే తన అక్కను నిత్యం కళ్లెదుటే చూసుకోవాలనే ఉద్దేశంతో తాడేపల్లిగూడెంలో శిల్పివద్ద ఆమె విగ్రహాన్ని తయారు చేయించాడు. రాఖీ పౌర్ణమి సందర్భంగా కత్తిపూడిలో ఊరేగింపు నిర్వహించి తన సోదరి ఇంటి వద్దే విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు.


Updated Date - 2022-08-12T08:57:04+05:30 IST