మాదక ద్రవ్యాలకు అలవాటుపడొద్దు
ABN , First Publish Date - 2022-06-29T05:46:01+05:30 IST
విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటుపడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని కొత్తపేట సీఐ ఏ.సుబ్రహ్మణ్యం అన్నారు.
మాదక ద్రవ్యాలకు అలవాటుపడొద్దు
యువతకు సీఐ సుబ్రహ్మణ్యం హితవు
చిట్టినగర్, జూన్ 28: విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటుపడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని కొత్తపేట సీఐ ఏ.సుబ్రహ్మణ్యం అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా నవజీవన్ బాలభవన్ ఆధ్వర్యంలో మంగళవారం పాలఫ్యాక్టరీ సయ్యద్ అప్పలస్వామి కళాశాల నుంచి సాయిరాం థియేటర్ వరకు అవగాహన ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారి ఎంతో మంది యువకులు, విద్యార్థులు బంగారు భవిష్యత్ పాడుచేసుకుంటున్నారన్నారు. ఎస్ఎఎస్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రాంపిళ్ల జయప్రకాష్, నవజీవన్ బాలభవన్ ప్రోగ్రాం మేనేజర్ గోళ్లమూడి శేఖర్బాబు, జోనల్ కో -ఆర్డినేటర్ ఎండీ వసంతకుమారి, బీ.రమేష్, కె.అనూష, భీమన్నవారిపేట సచివాలయ మహిళా పోలీస్ అనుషారాణి, డి. జ్యోతి, డి.అనూష, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.