కాలుష్య నియంత్రణ పై అవగాహన
ABN , First Publish Date - 2022-08-09T06:08:25+05:30 IST
నగరంలో కాలుష్య నియంత్రణ గురించి వాహన చోదకులకు కేవీఎస్ఆర్ సిద్ధార్థ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచంట సునీత ఆధ్వర్యంలో విద్యార్థులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
కాలుష్య నియంత్రణ పై అవగాహన
మొగల్రాజపురం:నగరంలో కాలుష్య నియంత్రణ గురించి వాహన చోదకులకు కేవీఎస్ఆర్ సిద్ధార్థ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచంట సునీత ఆధ్వర్యంలో విద్యార్థులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సోమవారం నగరంలో వివిధ కూడళ్లలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు పలు వాహనదారులను కలిసి వాహన కాలుష్యాన్ని నియంత్రించే పద్ధతులను తెలిపారు. తద్వారా ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ గురించి వివరించారు.