అయోధ్య మసీదును అహ్మదుల్లా షాకు అంకితమివ్వనున్న ట్రస్ట్

ABN , First Publish Date - 2021-01-25T17:46:17+05:30 IST

అయోధ్యలో నిర్మించబోయే మసీదును ప్రముఖ పోరాట యోధుడు అహ్మదుల్లా షాకు అంకితం చేయాలని ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్

అయోధ్య మసీదును అహ్మదుల్లా షాకు అంకితమివ్వనున్న ట్రస్ట్

న్యూఢిల్లీ : అయోధ్యలో నిర్మించబోయే మసీదును ప్రముఖ పోరాట యోధుడు అహ్మదుల్లా షాకు అంకితం చేయాలని ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ నిర్ణయించుకుంది. ఈ నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటిచనున్నట్లు సమాచారం. 1857 స్వాతంత్ర్యోద్యమంలో అహ్మదుల్లా షా ప్రముఖ పాత్ర పోషించారని,  అందుకే ట్రస్ట్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ‘‘అమోధ్యలో నిర్మించబోయే మసీదును స్వాతంత్ర్య యోధుడు అహ్మదుల్లా షా కు అంకితమిచ్చే విషయంలో లోతుగానే ఆలోచిస్తున్నాం. వివిధ వర్గాల అభిప్రాయాలను ఇప్పటికే మేం తెలుసుకున్నాం. మరో సారి చర్చలు జరిపిన తర్వాత ఈ నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడిస్తాం.’’ అని ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ప్రతినిధి పేర్కొన్నారు. 

Updated Date - 2021-01-25T17:46:17+05:30 IST