అలా పోల్చడం తెలుగు ప్రజల దౌర్భాగ్యం: అయ్యన్న

ABN , First Publish Date - 2021-04-12T20:43:49+05:30 IST

సీఎం జగన్‌‌రెడ్డిను రమణదీక్షితులు విష్ణుమూర్తితో పోల్చడం.. తెలుగు ప్రజల దౌర్భాగ్యమని మాజీమంత్రి, తెలుగుదేశం..

అలా పోల్చడం తెలుగు ప్రజల దౌర్భాగ్యం: అయ్యన్న

విశాఖ: సీఎం జగన్‌‌రెడ్డిను రమణదీక్షితులు విష్ణుమూర్తితో పోల్చడం.. తెలుగు ప్రజల దౌర్భాగ్యమని మాజీమంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు.  సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్థిక నేరస్థుడు జగన్‌ను రమణదీక్షితులు ఎందుకలా పోల్చారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్వామివారికి భక్తులు సమర్పించిన తలనీలాలను సైతం.. జగన్ విదేశాలకు అమ్ముకోవడం చూసి అలా అన్నారా? అని ఎద్దేవా చేశారు. తిరుపతి లడ్డూను అంగట్లో సరుకుగా మార్చారని మండిపడ్డారు. జగన్‌పై అభిమానం ఉంటే రమణ దీక్షితులు ఎన్నికల్లో పోటీ చేయాలని అయ్యన్నపాత్రుడు తెలిపారు.

Updated Date - 2021-04-12T20:43:49+05:30 IST