AP News: జగన్‌ సీఎం కావడం ప్రజల దురదృష్టం: అయ్యన్న

ABN , First Publish Date - 2022-07-23T01:02:25+05:30 IST

రాష్ట్రానికి జగన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ప్రజల దురదృష్టమని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) అన్నారు.

AP News: జగన్‌ సీఎం కావడం ప్రజల దురదృష్టం: అయ్యన్న

నర్సీపట్నం: రాష్ట్రానికి జగన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ప్రజల దురదృష్టమని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) అన్నారు. ఆయన శుక్రవారం వీడియోతో మాట్లాడుతూ  రాష్ట్రంలో జగనన్న విద్యా కానుక ఇప్పటికీ 80 శాతం మంది విద్యార్థులకు అందలేదన్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని తెలిపారు. మూడు కిలోమీటర్ల దూరంలో గల పాఠశాలలకు  చిన్నారులను పంపలేమని రాష్ట్రమంతటా విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నాలు చేస్తున్నప్పటికీ సీఎం స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని అయ్యన్న పాత్రుడు విమర్శించారు.

Updated Date - 2022-07-23T01:02:25+05:30 IST