పాత చెక్కులపై సంతకాలు పెట్టమంటున్నారు: అయ్యన్నపాత్రుడు
ABN , First Publish Date - 2021-07-26T23:33:45+05:30 IST
పాత చెక్కులపై సంతకాలు పెట్టమంటున్నారు: అయ్యన్నపాత్రుడు
విశాఖ: వైసీపీ ప్రభుత్వం పంచాయితీరాజ్ వ్యవస్థను నీరుగారుస్తోందని మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. సర్పంచులను కీలుబొమ్మలుగా తయారు చేశారని విమర్శించారు. పంచాయతీ రాజ్శాఖ అధికారులు పెత్తనం చేస్తున్నారని చెప్పారు. గతంలో ప్రత్యేక అధికారుల పాలనలో నిధులు దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత చెక్కులపై సర్పంచ్లను సంతకాలు పెట్టమంటున్నారని, లేదంటే చెక్ పవర్ రద్దు చేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు.