Azadi Ka Amrit Mahotsav: 15 లక్షల ఇళ్లపై జాతీయ జెండా రెపరెపలు: సోము వీర్రాజు

ABN , First Publish Date - 2022-08-11T01:07:16+05:30 IST

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ (Azadi Ka Amrit Mahotsav)లో భాగంగా రాష్ట్రంలో పదిహేను లక్షల మంది బీజేపీ నేతలు

Azadi Ka Amrit Mahotsav: 15 లక్షల ఇళ్లపై జాతీయ జెండా రెపరెపలు: సోము వీర్రాజు

విశాఖపట్నం: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ (Azadi Ka Amrit Mahotsav)లో భాగంగా రాష్ట్రంలో పదిహేను లక్షల మంది బీజేపీ నేతలు, కార్యకర్తల ఇళ్లపై జాతీయ జెండాలు ఎగురవేయడానికి ‘ఇంటింటికీ జెండా’ కార్యక్రమం చేపట్టిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు (Somu Veerraju) పేర్కొన్నారు. లాసన్స్‌ బే కాలనీలోని పార్టీ కార్యాలయం నుంచి బుధవారం ఉదయం ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు జాతీయ జెండాలను ఎగురవేస్తామన్నారు. ప్రజల్లో జాతీయ భావం పెంచడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. దేశంలో మొత్తం 20 కోట్ల ఇళ్లపై బీజేపీ నేతలు, కార్యకర్తలు జాతీయ జెండా (National flag)ను ఎగురవేస్తారని సోము వీర్రాజు పిలుపునిచ్చారు.

Updated Date - 2022-08-11T01:07:16+05:30 IST