బాబు, లోకేష్ త్వరగా కోలుకోవాలని పూజలు
ABN , First Publish Date - 2022-01-20T06:02:01+05:30 IST
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మం త్రి నారా లోకేష్ త్వరగా కోలుకోవాలని అనంత తెలుగు తమ్ముళ్లు, తెలుగు మ హిళలు పూజలు నిర్వహించారు.
అనంతపురం వైద్యం, జనవరి19: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మం త్రి నారా లోకేష్ త్వరగా కోలుకోవాలని అనంత తెలుగు తమ్ముళ్లు, తెలుగు మ హిళలు పూజలు నిర్వహించారు. ఆ ఇద్దరు కరోనా బారిన పడడంతో... తమ అభిమాన నాయకులు కరోనా నుంచి త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రా వాలని బుధవారం నగరంలోని రైల్వే స్టేషన సమీపంలో ఉన్న వినాయ క స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు. అక్కడే 101 టెంకాయలు కొట్టి తమ నేతలు వెంటనే కోలుకోవాలని వేడుకున్నారు. అలాగే తెలుగు మహిళలు వెంకటేశ్వరస్వామి, వినాయక దేవాలయం, చర్చి, దర్గాలలో పూజలు, ప్రార్థనలు నిర్వహించి తమ అభిమాన నేతలు చంద్రబాబు, లోకేష్ వెంటనే కోలుకో వా లని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు తలారి ఆది నారాయణ, దేవళ్ల మురళి, మాజీ మేయర్, అనంత పార్లమెంటు తెలుగు మ హిళ అధ్యక్షురాలు మదమంచి స్వరూప, టీడీపీ నగర అధ్యక్షుడు మారుతిగౌడ్, కుంచెపు వడ్డే వెంకటేష్, నారాయణస్వామియాదవ్, వెంకటేష్గౌడ్, మాసూలు శ్రీనివాసులు, గుర్రం నాగభూ షణ, కూచే హరి, బొమ్మినేని శివ, దాసరి శ్రీధర్, జేఎం బాషా, శేఖర్, నాగరాజు, శ్రీనివాస చౌదరి, బీటెక్ దాదు, జనార్దన రెడ్డి, టైలర్ శీనా, రాంబాబు, తెలుగు మహిళ నాయకురాళ్ళు విజయశ్రీ, జానఖి, తేజ శ్విని, మహేశ్వరి, వసుంధర, కంటాదేవి, పద్మావతమ్మ, వెంకటలక్ష్మి, సుజాత మ్మతో పాటు పలువురు టీడీపీ శ్రేణులు, తెలుగు మహిళలు పాల్గొన్నారు.
అనంతపురంరూరల్: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్య దర్శులు చంద్రబాబునాయుడు, నారాలోకేష్, మాజీ మంత్రి పరిటాల సునీత, యువ నాయకుడు పరిటాల శ్రీరామ్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని మై నార్టీ నాయకులు మసీదులో ప్రార్థనలు చేశారు. తెలుగు యువత నాయకుడు బుల్లెట్ రఫీ ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని అక్కంపల్లి పంచాయతీ లోని ఎనఆర్ కాలనీ మసీదులో తెల్లవారుజామున 5గంటల నుంచి ప్ర త్యేక నమాజ్ చేసి దువా చేశారు. టీడీపీ మైనార్టీ నాయకులు అల్లిపీరా, మౌలానా, అక్కంపల్లి వన్నూరు వలి, హైదరివలి, బాబు, మస్జీద్ పెద్దలు పాల్గొన్నారు.
శింగనమల: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చంద్రబాబునాయుడు, నారా లోకేష్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని మా జీ జడ్పీటీసీ శాలిని, మండల మాజీ కన్వీనర్ చితంబరిదొర ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల కేంద్రంలోని ఆంజనేయస్వామికి బుధవారం ప్రత్యేక పూజలు చేయించారు.