ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై Chandra Babu త్వరలో రోడ్ షోలు

ABN , First Publish Date - 2022-06-09T01:38:52+05:30 IST

Amaravathi: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతి జిల్లాలో మినీ మహానాడు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 26 జిల్లాలలో

ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై Chandra Babu త్వరలో రోడ్ షోలు

Amaravathi: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతి జిల్లాలో మినీ మహానాడు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 26 జిల్లాలలో ఏడాది పాటు విస్తృతంగా పర్యటించనున్నారు. ఒక్కో టూర్ మూడు రోజుల చొప్పున నెలకు రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ నెల మూడో వారం నుంచే జిల్లాల పర్యటన ప్రారంభించ నున్నారు. మొదటి రోజు బహిరంగ సభ, రెండో రోజు పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్‌లతో సమీక్షలు, క్యాడర్‌తో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తారు. జిల్లా టూర్‌లో మూడో రోజు వివిధ నియోజకవర్గాల్లో రోడ్ షో నిర్వహిస్తారు. జిల్లా పర్యటనల్లో ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై మాట్లాడతారు. ఏడాదిలో 80కి పైగా నియోజకవర్గాలు కవర్ అయ్యేలా పర్యటన రూపొందించారు. అటు జిల్లాల పర్యటనలు, ఇటు పార్టీ  కేంద్ర కార్యాలయంలో పార్టీ వ్యవహారాలు సమాంతరంగా జరిగేలా షెడ్యూల్ తయారు చేశారు. 

Updated Date - 2022-06-09T01:38:52+05:30 IST