బ్యాడ్మింటన్ డబుల్స్లో సాత్విక్ విజయం
ABN , First Publish Date - 2021-07-25T06:37:18+05:30 IST
ఒలిం పిక్స్ పోటీల్లో అమలాపురం పట్టణానికి చెందిన రంకిరెడ్డి సాత్విక్సాయిరాజ్ తొలి విజయాన్ని నమోదు చేసుకున్నాడు.
అమలాపురం టౌన్, జూలై 24: ఒలిం పిక్స్ పోటీల్లో అమలాపురం పట్టణానికి చెందిన రంకిరెడ్డి సాత్విక్సాయిరాజ్ తొలి విజయాన్ని నమోదు చేసుకున్నాడు. శనివారం బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో సాత్విక్సాయిరాజ్-చిరాగ్శెట్టి జోడి చైనా క్రీడాకారులతో తలపడ్డారు. మూడు సెట్ల కింద జరిగిన పోటీల్లో సాత్విక్సాయిరాజ్ జంట రెండు సెట్లలో విజయం సాధించి తొలి విజయాన్ని తమ ఖాతాలో జమ చేసుకుంది. దాంతో అమలాపురం పట్టణంలో క్రీడాభిమానులు సాత్విక్సాయిరాజ్ జంటకు అభినందనలు తెలుపుతూ సంబరాలు జరుపుకున్నారు. సాత్విక్ తల్లిదండ్రులు రంకిరెడ్డి కాశీవిశ్వనాథం, రంగమణిల ఇంట సంబరాలు నిర్వహించి కేక్ కట్చేసి అందరికీ తినిపించారు.
రాజమహేంద్రవరం అర్బన్ : ఒలింపిక్స్లో శుభారంభం చేసిన సాత్విక్కు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరపున అధ్యక్షురాలు కొడాలి తనూజ, జిల్లా కార్యదర్శి చుండూరు గోవిందరాజులు, పాట్రన్ మెంబర్ భమ్మిరెడ్డి అభినందనలు తెలియజేశారు.