‘వచ్చేది టీడీపీయే’
ABN , First Publish Date - 2022-06-30T06:12:30+05:30 IST
వచ్చే ఎన్నికల్లో టీడీపీదే అధికారం అని ఆ పార్టీ గోస్పాడు మండల కన్వీనర్ చంద్రశేఖరరెడ్డి అన్నారు.
గోస్పాడు, జూన్ 29: వచ్చే ఎన్నికల్లో టీడీపీదే అధికారం అని ఆ పార్టీ గోస్పాడు మండల కన్వీనర్ చంద్రశేఖరరెడ్డి అన్నారు. మండలంలోని జిల్లెల్ల గ్రామంలో బుధవారం బాదుడే.. బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. నాయకులు ఇంటింటికీ వెళ్లి టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం వివరిస్తూ వైసీపీ ప్రభుత్వం పన్నులు పెంచి పేద ప్రజలపై భారం మోపుతోందని విమర్శించారు. ఎంపీటీసీ సభ్యురాళ్లు శివమ్మ, లక్ష్మీదేవమ్మ, టీడీపీ మండల మాజీ కన్వీనర్ శీలం భాస్కరరెడ్డి, సదాశివనందరెడ్డి, ఈశ్వరరెడ్డి, చంద్రశేఖరరెడ్డి, పేరయ్య చౌదరి, మాజీ ఎంపీటీసీ భాస్కరరెడ్డి, కృష్ణారెడ్డి, నారాయణరెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
కొలిమిగుండ్ల: మండలంలోని తిమ్మనాయునిపేట గ్రామంలో బుధవారం బాదుడు.. బాదుడు కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టగ్రామంలో ర్యాలీ నిర్వహించారు. నిత్యావసర సరకుల ధరలు, పెట్రోల్, డీజల్, కరెంట్ బిల్లుల పెంపు, ఓటీఎస్, పెంచిన గ్యాస్ ధరలకు నిరసన వ్యక్తం చేసి ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. టీడీపీ కార్యకర్తలు దాసరి గోపాల్, గిరి, బాలు, బాలసుబ్బరాయుడు, వెంకటేశ్వర్లు, సుబ్బరాయుడు, కార్యకర్తలు పాల్గొన్నారు.