ఏఎస్‌కవిటి, చాకిపల్లిల్లో ‘బాదుడే-బాదుడు’

ABN , First Publish Date - 2022-07-07T05:11:43+05:30 IST

టీడీపీ అధిష్టానం పిలుపు మేరకు ఏఎస్‌కవిటి, చాకి పల్లి పంచాయతీలలో బుధవారం ‘బాదుడే బాదుడు’ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కలమట సాగర్‌తో పాటు నేతలు ర్యాలీగా ఇంటింటికీ వెళ్లి కరపత్రాలిచ్చి వైసీపీ వైఫల్యాలపై అవగాహన కలిగించారు.

ఏఎస్‌కవిటి, చాకిపల్లిల్లో ‘బాదుడే-బాదుడు’
పాతపట్నం: వైసీపీ వైఫల్యాలపై కరపత్రాలిచ్చి అవగాహన కలిగిస్తున్న కలమట సాగర్‌ తదితరులు

పాతపట్నం: టీడీపీ అధిష్టానం పిలుపు మేరకు ఏఎస్‌కవిటి, చాకి పల్లి పంచాయతీలలో బుధవారం ‘బాదుడే బాదుడు’ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కలమట సాగర్‌తో పాటు నేతలు ర్యాలీగా ఇంటింటికీ వెళ్లి కరపత్రాలిచ్చి వైసీపీ వైఫల్యాలపై అవగాహన కలిగించారు. ఆర్టీసీ, విద్యుత్‌ చార్జీలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు పెంచి అన్ని వర్గాల ప్రజలపై పెనుభారం మోపారని విమర్శిం చారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Updated Date - 2022-07-07T05:11:43+05:30 IST