బడుగుల ఆశాజ్యోతి ఎన్టీఆర్
ABN , First Publish Date - 2022-05-29T07:00:11+05:30 IST
బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి నందమూరి తారక రామారావు అని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు.
మాజీ మంత్రి పరిటాల సునీత
అనంతపురం అర్బన, మే 28: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి నందమూరి తారక రామారావు అని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని, హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్కు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, టీడీపీ రాప్తాడు నియోజకవర్గ నాయకులతో కలిసి శనివారం వెళ్లారు. ఘాట్ వద్ద పూల మాలలు వేసి ఎన్టీఆర్కు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ, యుగ పురుషుడు జన్మించిన రోజే తన పుట్టిన రోజు కావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా పరిటాల సునీతకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హైదరాబాద్లోని తన నివాసంలో నియోజకవర్గ శ్రేణులు, అభిమానుల మధ్య పరిటాల సునీత కేక్ కట్ చేశారు.