కడప: బద్వేల్ ఉపఎన్నికలో నియోజకవర్గంలోని చాలా పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 9 గంటలు గడిచినప్పటికీ ఓటర్లు కనిపించని పరిస్థితి నెలకొంది. ఒటర్లు లేక పలు పోలింగ్ కేంద్రాలు బోసిపోయాయి. బద్వేల్ ఉపఎన్నిక బరిలో టీడీపీ లేకపోవడంతోనే పోలింగ్ మందకొడిగా సాగుతోంది. టీడీపీకి పట్టున్న గ్రామాల్లో ఓటర్లు ఓటును వినియోగించుకోని పరిస్థితి ఏర్పడింది. బద్వేలు ఉపఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 10.49 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.