అంతర్జాతీయ ప్రయాణికులకు బహ్రెయిన్ గుడ్‌న్యూస్

ABN , First Publish Date - 2022-02-18T16:09:21+05:30 IST

అంతర్జాతీయ ప్రయాణికులకు బహ్రెయిన్ తీపి కబురు చెప్పింది. కొవిడ్ నియమాల నుంచి భారీ ఉపశమనం కల్పిస్తున్నట్టు వెల్లడించింది. ప్రయాణికులు బహ్రెయిన్‌కు చేరుకున్న తర్వాత తప్పనిసరిగా క్వారెం

అంతర్జాతీయ ప్రయాణికులకు బహ్రెయిన్ గుడ్‌న్యూస్

ఎన్నారై డెస్క్: అంతర్జాతీయ ప్రయాణికులకు బహ్రెయిన్ తీపి కబురు చెప్పింది. కొవిడ్ నియమాల నుంచి భారీ ఉపశమనం కల్పిస్తున్నట్టు వెల్లడించింది. ప్రయాణికులు బహ్రెయిన్‌కు చేరుకున్న తర్వాత తప్పనిసరిగా క్వారెంటైన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదని వెల్లడించింది. కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రపంచ దేశాలు ప్రయాణికులపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బహ్రెయిన్ కూడా తమ దేశానికి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. అయితే ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వస్తున్న నేపథ్యంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు బహ్రెయిన్‌కు చేరుకున్న తర్వాత తప్పనిసరిగా క్వారెంటైన్‌కు వెళ్లాల్సిన అవసరం ఇకపై ఉండబోదని గురువారం ప్రకటించింది. అదేవిధంగా ప్రయాణికులు బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వెంటనే పీసీఆర్ టెస్టు చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదని సివిల్ ఏవియేషన్ అఫైర్స్ వెల్లడించింది. ఆ ఆదేశాలు ఆదివారం అంటే ఫిబ్రవరి 20 నుంచి అమలులోకి రానున్నట్టు పేర్కొంది. 




Updated Date - 2022-02-18T16:09:21+05:30 IST