Bail: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అల్లర్ల కేసులో 16మందికి బెయిల్

ABN , First Publish Date - 2022-08-04T01:06:26+05:30 IST

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అల్లర్ల కేసులో 16మందికి బెయిల్ వచ్చింది. ఒక్కో అభ్యర్థికి రూ.20వేలు, పూచీకత్తుపై కోర్టు బెయిల్ (Bail) మంజూరు చేసింది.

Bail: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అల్లర్ల కేసులో 16మందికి బెయిల్

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అల్లర్ల కేసులో 16మందికి బెయిల్ వచ్చింది. ఒక్కో అభ్యర్థికి రూ.20వేలు, పూచీకత్తుపై కోర్టు బెయిల్ (Bail) మంజూరు చేసింది. రైల్వేకోర్టు మెజిస్ట్రేట్ సెలవులో ఉండడంతో నాంపల్లి కోర్టులో బెయిల్ ఫార్మాలిటీస్ కుటుంబీకులు పూర్తిచేశారు. సైన్యంలో నియామకాల కోసం కేంద్రం కొత్తగా తెచ్చిన ‘అగ్నిపథ్‌’పై (Agnipath) ఆర్మీ అభ్యర్థులు ఆగ్రహంతో రగిలిపోయారు. ఆర్మీర్యాలీల్లో అర్హత సాధించి.. వైద్యపరీక్షలు కూడా పూర్తిచేసుకుని పరీక్షలు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న వేళ కొత్త పథకాన్ని ప్రకటించడంతో అభ్యర్థులు మండిపడ్డారు. పక్కా ప్రణాళిక ప్రకారం దాదాపు రెండు వేల మంది సికింద్రాబాద్‌ (Secunderabad) రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశించి పలు రైళ్లను ధ్వంసం చేశారు. ఇంజన్లు, బోగీలకు నిప్పు పెట్టారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. వారిని అదుపులోకి తెచ్చేందుకు ఆర్పీఎఫ్‌ కానిస్టేబుళ్లు జరిపిన కాల్పుల్లో.. వరంగల్‌ జిల్లాకు చెందిన యువకుడు రాకేష్ (Warangal Rakesh) మరణించగా, పలువురికి గాయాలయ్యాయి.

Updated Date - 2022-08-04T01:06:26+05:30 IST