నౌహీరా బెయిల్‌ పొడిగింపు

ABN , First Publish Date - 2021-04-20T07:29:12+05:30 IST

అక్రమంగా డిపాజిట్లు సేకరించి కుంభకోణానికి పాల్పడ్డ హీరాగోల్డ్‌ గ్రూప్‌ సీఈవో నౌహీరా షేక్‌కు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌ను సుప్రీం కోర్టు మరోసారి పొడిగించింది.

నౌహీరా బెయిల్‌ పొడిగింపు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): అక్రమంగా డిపాజిట్లు సేకరించి కుంభకోణానికి పాల్పడ్డ హీరాగోల్డ్‌ గ్రూప్‌ సీఈవో నౌహీరా షేక్‌కు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌ను సుప్రీం కోర్టు మరోసారి పొడిగించింది. ఆమె దాఖలు చేసుకున్న పిటిషన్‌పై సోమవారం న్యాయమూర్తులు జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ హేమంత్‌ గుప్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఆమె తరఫున సీనియర్‌ న్యాయవాది రంజిత్‌కుమార్‌ వాదిస్తూ.. బెయిల్‌ షరతులన్నింటినీ ఆమె పాటిస్తున్నారని తెలిపారు. డిపాజిటర్లకు తిరిగి డబ్బు చెల్లించే ప్రక్రియ జరుగుతోందని వివరించారు. దాంతో తదుపరి విచారణ వరకు బెయిల్‌ను పొడిగిస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. అదనపు డాక్యుమెంట్లు సమర్పించడానికి అనుమతించింది. తదుపరి విచారణను మే 6వ తేదీకి వాయిదా వేసింది. 


Updated Date - 2021-04-20T07:29:12+05:30 IST