రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణకు ముందస్తు బెయిల్..
ABN , First Publish Date - 2021-12-13T20:28:35+05:30 IST
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణకు ముందస్తు బెయిల్..
అమరావతి : ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యకలాపాల్లో అక్రమాలు జరిగాయంటూ... రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.లక్ష్మీనారాయణ నివాసంలో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో లక్ష్మీనారాయణ ఏ2గా ఉన్నారు. ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో విచారణకు వెళ్లలేకపోయారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేయగా విచారించింది. సుమారు అరగంటపాటు విచారించిన హైకోర్టు 15 రోజుల ముందస్తు బెయిల్ను మంజూరు చేసింది.
కాగా.. శుక్రవారం నాడు హైదరాబాద్లోని లక్ష్మీనారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ సోదాలు నిర్వహించింది. ఇవాళ విచారణకు రావాల్సిందిగా ఆయన సీఐడీ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం స్టార్ ఆస్పత్రిలో ఐసీయూలో లక్ష్మీనారాయణ ఉన్నారు. మందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి పై విధంగా బెయిల్ మంజూరు చేయడం జరిగింది. సీఐడీ తనిఖీలు జరుపుతుండగా ఇంట్లో ఆయన స్పృహ తప్పి పడిపోయారు. అధిక రక్తపోటుతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. ఐసీయూలో డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. అప్పట్నుంచి ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు.