విజయసాయిరెడ్డిని జగన్ నమ్ముకుంటే పార్టీ మూసుకోవాల్సిందే: బైరెడ్డి
ABN , First Publish Date - 2020-02-03T01:42:32+05:30 IST
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసిస్తుంటే ఏపీ సీఎం జగన్ పాటిస్తూ పాలన చేస్తున్నాడని రాయలసీమ పరిరక్షణ సమితి నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఏపీకి ...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసిస్తుంటే ఏపీ సీఎం జగన్ పాటిస్తూ పాలన చేస్తున్నాడని రాయలసీమ పరిరక్షణ సమితి నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఏపీకి విజయసాయిరెడ్డి రెండో సీఎం అని ఆయన వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డిని జగన్ నమ్ముకుంటే పార్టీ మూసుకోవాల్సిందేనని చెప్పారు. చంద్రబాబును జన్మభూమి కమిటీలు నట్టేట ముంచాయని తెలిపారు. జగన్ను వలంటీర్లు ముంచుతారని బైరెడ్డి పేర్కొన్నారు.