దేశంలోనే శక్తిమంతంగా బాలాజీ జిల్లా

ABN , First Publish Date - 2022-01-28T05:01:21+05:30 IST

ప్రఖ్యాతిగాంచిన తిరుమల, తిరుపతి దేవస్థానాలు, శ్రీకాళహస్తి దేవస్థానం, శ్రీహరికోట రాకెట్‌ ప్రయోగకేంద్రంతో దేశంలోనే బాలాజీ జిల్లా శక్తిమంతమైందని సూళ్లూరుపేట ఎమ్మెల్యే, టీటీడీ పాలకమండలి సభ్యుడు కిలివేటి సంజీవయ్య అన్నారు.

దేశంలోనే శక్తిమంతంగా బాలాజీ జిల్లా
విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు కిలివేటి సంజీవయ్య

 ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య

నాయుడుపేట,  జనవరి 27 : ప్రఖ్యాతిగాంచిన తిరుమల, తిరుపతి దేవస్థానాలు, శ్రీకాళహస్తి దేవస్థానం, శ్రీహరికోట రాకెట్‌ ప్రయోగకేంద్రంతో దేశంలోనే బాలాజీ జిల్లా శక్తిమంతమైందని సూళ్లూరుపేట ఎమ్మెల్యే, టీటీడీ పాలకమండలి సభ్యుడు కిలివేటి సంజీవయ్య అన్నారు. నాయుడుపేటలోని ఎమ్మెల్యే కార్యాలయంలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సూళ్లూరుపేట నియోజకవర్గం బాలాజీ జిల్లాలో విలీనంకావడం ఎంతో హర్షణీయమన్నారు. నియోజకవర్గం వైద్య, ఆధ్యాత్మిక,  సాంకేతిక ప్రాధాన్యతను సంతరించుకోనుందన్నారు. నాయుడుపేట రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 6 మండలాలు ఉండగా బాలాజీ జిల్లా ఏర్పాటుతో ఆ సంఖ్య 13 కి చేరిందన్నారు.  కార్యక్రమంలో ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి,  వైసీపీ మండల కన్వీనర్‌ తంబిరెడ్డి సుబ్రహ్మణ్యంరెడ్డి, కామిరెడ్డి రాజారెడ్డి, కలికి మాధవరెడ్డి, కట్టా రమణారెడ్డి, అత్తివరం గోపాల్‌రెడ్డి, కటకం జయరామ్‌, చదలవాడ కుమార్‌, దారా రవి, నాగార్జున, షబ్బీర్‌, సిద్ధయ్య, రాహుల్‌, పవన్‌ ఉన్నారు.

Updated Date - 2022-01-28T05:01:21+05:30 IST