‘తాను ఉప్పుకారం తినేవాడినే...నాకూ రోషం పౌరుషం ఉంది’

ABN , First Publish Date - 2022-06-28T21:38:22+05:30 IST

టీడీపీ నాయకులతో కలిసి కొంత మంది వైసీపీ నాయకులు తనపై కుట్ర చేస్తున్నారని మరో సారి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు చేశారు.

‘తాను ఉప్పుకారం తినేవాడినే...నాకూ రోషం పౌరుషం ఉంది’

ప్రకాశం: టీడీపీ నాయకులతో కలిసి కొంత మంది వైసీపీ నాయకులు తనపై కుట్ర చేస్తున్నారని మరో సారి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఒంగోలులో జరిగిన వైసీపీ ప్లీనరీలో తనపై వైసీపీ నాయకులు కుట్ర చేస్తున్నారని ఆరోపణ చేస్తున్నారు. వైసీపీలో ఉన్న వాళ్లు డ్రామాలు చేస్తే కాళ్లు విరుగుతాయని బాలినెని హెచ్చరించారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు పద్దతి మార్చుకోవాలని సూచించారు. తాను ఉప్పుకారం తినేవాడినే...నాకూ రోషం పౌరుషం ఉన్నాయన్నారు. అన్ని విషయాలు సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. మద్రాసులో ఐదు కోట్లు డబ్బులు దొరికితే...నన్ను హవాలా మంత్రిగా ప్రచారం చేశారని మండిపడ్డారు. అల్లూరులో కవితారెడ్డితో గొడవ చేయిస్తున్నారని తనకు ముందే తెలుసన్నారు. పవన్ కళ్యాణ్ విజ్ణప్తి మేరకు జనసేన కార్యకర్తపై పెట్టిన కేసు ఉపసంహరించుకున్నామన్నారు. పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకులనే కాదు...తప్పు చేసే టీడీపీ నాయకులను కూడా ప్రశ్నించాలన్నారు. 

Updated Date - 2022-06-28T21:38:22+05:30 IST