KCR కొత్త జాతీయ పార్టీ అనగానే వారిలో వణుకు మొదలైంది: Balka Suman

ABN , First Publish Date - 2022-06-12T18:36:36+05:30 IST

రేంత్ రెడ్డి, బండి సంజయ్‌కు సీఎం కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదని బాల్క సుమన్ అన్నారు.

KCR కొత్త జాతీయ పార్టీ అనగానే వారిలో వణుకు మొదలైంది: Balka Suman

Hyderabad: కుల గజ్జి రేవంత్ (Revanth), మత పిచ్చి బండి సంజయ్‌ (Bandi Sanjay)కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR) గురించి మాట్లాడే అర్హత లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్  కొత్త జాతీయ పార్టీ అనగానే వారిలో వణుకు మొదలైందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ భారత జాతికి ద్రోహం చేసిన పార్టీలని విమర్శించారు. ‘కేసీఆర్ కాలం చెల్లిన మెడిసిన్ కాదు.. ప్రాణం పోసే సంజీవని’ అన్నారు. సోనియాకు ఈడి నోటీస్ ఇస్తే కాంగ్రెస్ ధీటుగా పోరాడటం లేదని, ఆ పార్టీ కొన ఊపిరితో ఐసియూలో ఉందన్నారు. 


బీజేపీది ఢిల్లీలో తుగ్లక్ పాలన అని, గల్లీలో తుగ్లక్ వాదన అని బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. బీజేపీ ఉన్మాదాన్ని, దుర్మార్గాలను దేశ ప్రజల ముందు పెడతామన్నారు. మరో పోరాటానికి దేశం సిద్ధ పడుతుందని, బీజేపీ, కాంగ్రెస్ నేతలు పద్దతి మార్చుకోవాలని సూచించారు. రేవంత్ నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదంటే తగిన బుద్ది చెబుతామన్నారు. బండి సంజయ్‌కు చేతనైతే విభజన హామీలు అమలు చేసి చేపించాలని బాల్క సుమన్ అన్నారు.

Updated Date - 2022-06-12T18:36:36+05:30 IST