5న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం
ABN , First Publish Date - 2022-06-30T17:56:43+05:30 IST
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం జూలై 5న, రథోత్సవం 6న నిర్వహిస్తున్నారు. కల్యాణాన్ని వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి సుమారు 5లక్షల భక్తులు హాజరయ్యే అవకాశముందని
6న రథోత్సవం
హైదరాబాద్/అమీర్పేట: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం జూలై 5న, రథోత్సవం 6న నిర్వహిస్తున్నారు. కల్యాణాన్ని వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి సుమారు 5లక్షల భక్తులు హాజరయ్యే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులంతా అమ్మవారి కల్యాణాన్ని దగ్గరగా చూసేలా 6 ఎల్ఈడీ స్ర్కీన్లను ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా అమ్మవారి కల్యాణోత్సవాన్ని ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నిరంతరం నిఘా కోసం 80 అదనపు సీసీ కెమెరాలను బిస్తున్నారు.
సమన్వయంతో పనిచేయాలి : మంత్రి తలసాని
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి అమ్మవారి కల్యాణోత్సవాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివా్సయాదవ్ పిలుపునిచ్చారు. బుధవారం వివిధ శాఖల అధికారులు, స్థానికులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
అమ్మవారికి బంగారు బోనం, పట్టువస్త్రాలు
చాంద్రాయణగుట్ట: గోల్కొండ జగదాంబ అమ్మవారికి బంగారు బోనం, పట్టువస్ర్తాలను సోమవారం సమర్పించనున్నట్లు భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు రాకేశ్ తివారి తెలిపారు.