నగరానికి చేరుతున్న బ్యాలెట్ బాక్సులు
ABN , First Publish Date - 2021-02-28T06:41:58+05:30 IST
జీవీఎంసీ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లను పూర్తిచేయడంతో అధికారులు నిమగ్నమయ్యారు.
విశాఖపట్నం, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): జీవీఎంసీ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లను పూర్తిచేయడంతో అధికారులు నిమగ్నమయ్యారు. ఎన్నికల్లో అత్యంత కీలకమైన బ్యాలెట్ బాక్సులను నగరానికి తీసుకొచ్చే ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. జీవీఎంసీ ఎన్నికలకు 3,608 బ్యాలెట్ బాక్సులు అవసరమని అధికారులు గుర్తించగా, వీటిని రూరల్ జిల్లా పరిధిలోని 22 మండలాల నుంచి సేకరించాలని జిల్లా కలెక్టర్ వినయ్చంద్ ఆదేశించారు. దీంతో జీవీఎంసీ యూసీడీ అధికారులు తొమ్మిది ఆర్టీసీ గూడ్సు బస్సుల ద్వారా శనివారం నగరానికి రప్పించి, జీవీఎంసీ జోనల్ కార్యాలయాలకు చేర్చుతున్నారు. జోనల్ కమిషనర్లకు వీటిని అందజేసిన తర్వాత స్ర్టాంగ్రూమ్లలో భద్రపరుస్తారు. సిబ్బంది వీటికి రిపేర్లు, ఆయిలింగ్ వంటి నిర్వహణ పనులు పూర్తి చేయాల్సి ఉంది.