బెలూన్లు అమ్ముకునే ఈ అమ్మాయి.. రాత్రికి రాత్రే.. వైరల్ అవుతున్న ఫొటోలు!

ABN , First Publish Date - 2022-03-12T23:01:38+05:30 IST

ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనది సోషల్ మీడియా. ఎంతలా అంటే.. ఓ గొప్ప వ్యక్తి జీవితాన్ని రాత్రికి రాత్రే నడీరోడ్డుపైకి తీసుకురాగలదు. అదే విధంగా సాధారణ వ్యక్తిని అందలమూ ఎక్కించగలదు. గతంలో

బెలూన్లు అమ్ముకునే ఈ అమ్మాయి.. రాత్రికి రాత్రే.. వైరల్ అవుతున్న ఫొటోలు!

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనది సోషల్ మీడియా. ఎంతలా అంటే.. ఓ గొప్ప వ్యక్తి జీవితాన్ని రాత్రికి రాత్రే నడీరోడ్డుపైకి తీసుకురాగలదు. అదే విధంగా సాధారణ వ్యక్తిని అందలమూ ఎక్కించగలదు. గతంలో రాను మండల్.. మొన్నటికి మొన్న మమ్మక్క‌ాల జీవితాన్ని మార్చేసిన సోషల్ మీడియా తాజాగా బెలూన్లు అమ్ముకునే అమ్మాయిని మోడల్‌గా మార్చేసింది.



ఆ అమ్మాయి పేరు కిస్బు. పొట్టకూటి కోసం రాజస్థాన్ నుంచి కేరళకు వలస వొచ్చింది. జనసమూహాలు ఉన్న చోట బెలూన్లు అమ్ముతూ వచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తోంది. ఈ అమ్మాయి తాజాగా ఓ గుడి ప్రాంగణంలో బెలూన్లు అమ్మడాన్ని అర్జున్ కృష్ణన్ అనే ఫొటో గ్రాఫర్ చూశాడు. అనంతరం రకరకాల స్టిల్స్‌లో కిస్బు ఫొటోలు తీసి, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ ఫొటోలు కాస్తా వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో రెమ్యా అనే స్టైలిస్ట్.. కిస్బు కుటుంబ సభ్యులను సంప్రదించింది. వారి అనుమతితో ఫేషియల్, మానిక్యూర్ వంటివి చేసి కిస్బూ రూపురేఖలనే మార్చేసింది. సంప్రదాయబద్ధమైన చీర కట్టులో బంగారు అభరణలతో ఆమెను అందంగా ముస్తాబు చేసింది. ఈ క్రమంలో కుందనపు బొమ్మలా మారిన కిస్బు‌ ఫొటోలను అర్జున్ కృష్ణన్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ఫొటోలు వీపరీతంగా వైరల్ కావడంతో దీంతో.. కిస్బూ మోడల్‌గా మారిపోయింది. తమ కంపెనీకి మోడల్‌గా ఉండాలంటూ కిస్బూను పలు కంపెనీలు సంప్రదిస్తున్నాయి. 




Updated Date - 2022-03-12T23:01:38+05:30 IST