జగన్.. తాడేపల్లి ప్యాలెస్ వదిలి జనాల్లోకి రావాలి: బండారు సత్యనారాయణమూర్తి
ABN , First Publish Date - 2022-04-18T21:22:59+05:30 IST
సీఎం జగన్రెడ్డికి ప్రజా సమస్యలు తెలియాలంటే తాడేపల్లి ప్యాలెస్ వదిలి జనాల్లోకి రావాలని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు.
విశాఖపట్నం: సీఎం జగన్రెడ్డికి ప్రజా సమస్యలు తెలియాలంటే తాడేపల్లి ప్యాలెస్ వదిలి జనాల్లోకి రావాలని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. సోమవారం ఆర్టీసీ బస్ టికెట్ల ధరలను పెంచడాన్ని నిరసిస్తూ పెందుర్తి జంక్షన్ నుంచి వేపగుంట వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. బస్సులో ప్రయాణించి.. ప్రయాణికుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పరిపాలన చేతకాని జగన్రెడ్డి చంద్రబాబు నాయుడుని చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు కరెంట్ ఇచ్చేవాళ్లమని చెప్పారు. ఇప్పుడు రోజుకు ఆరుగంటలు పవర్ కట్ అమలు చేసే స్థాయికి ఏపీని జగన్ తీసుకెళ్లారని మండిపడ్డారు.